Friday 19 September 2014

మహాశివరాత్రిని ఎందుకు జరుపుకొంటారు?

శివరాత్రి నాడు శివుడు విరామము తీసుకొంటారు. రాత్రిలో ఒక్క ‘ప్రహరము’ సమయమున ఆయన విరామము తీసుకొంటారు. ప్రహరము అంటే మూడు గంటల సమయము. ఎప్పుడైతే శివ భగవానుడు విరామము తీసుకొంటారో, అప్పుడు ‘శివ తత్త్వము’ ప్రక్షిపించబడదు, అంటే వారు ధ్యానవస్థలో ఉంటారు. ఈ సమయమున వారు తన వ్యక్తిగత సాధనకు సమయము ఇస్తున్నట్లుగా భావించాలి. ఆ సమయములో, శివతత్త్వము ఎట్టి తామసిక గుణమును గాని, బ్రహ్మండములోని హాలాహలమును గాని స్వీకరించదు. అందువలన చెడు శక్తుల ప్రభావము పెరుగుతుంది. ఈ ప్రభావము నుండి కాపాడుకోవడానికి ‘బిల్వ పత్రము’, తెల్లని పువ్వులు, ‘రుద్రాక్ష’లను శివునికి సమర్పిస్తారు. ఇవి వాతావరణములోని ‘శివ తత్త్వమును’ ఆకర్షించి చెడు శక్తుల ప్రభావము నుండి రక్షిస్తాయి. 


 

‘జ్ఞానం ఇచ్చేత్ సదాశివాత్ l
మోక్షం ఇచ్చేత్ జనార్దనాత్ ll’
అనగా ఆధ్యాత్మిక జ్ఞానము కోసము శివుడిని మరియు మోక్షము కొరకు జనార్దుడిని(విష్ణువు) కొలవాలని అర్థము !

No comments:

Post a Comment