శివరాత్రి నాడు శివుడు విరామము తీసుకొంటారు. రాత్రిలో ఒక్క ‘ప్రహరము’
సమయమున ఆయన విరామము తీసుకొంటారు. ప్రహరము అంటే మూడు గంటల సమయము. ఎప్పుడైతే
శివ భగవానుడు విరామము తీసుకొంటారో, అప్పుడు ‘శివ తత్త్వము’
ప్రక్షిపించబడదు, అంటే వారు ధ్యానవస్థలో ఉంటారు. ఈ సమయమున వారు తన
వ్యక్తిగత సాధనకు సమయము ఇస్తున్నట్లుగా భావించాలి. ఆ సమయములో, శివతత్త్వము
ఎట్టి తామసిక గుణమును గాని, బ్రహ్మండములోని
హాలాహలమును గాని స్వీకరించదు. అందువలన చెడు శక్తుల ప్రభావము పెరుగుతుంది. ఈ
ప్రభావము నుండి కాపాడుకోవడానికి ‘బిల్వ పత్రము’, తెల్లని పువ్వులు,
‘రుద్రాక్ష’లను శివునికి సమర్పిస్తారు. ఇవి వాతావరణములోని ‘శివ తత్త్వమును’
ఆకర్షించి చెడు శక్తుల ప్రభావము నుండి రక్షిస్తాయి.
‘జ్ఞానం ఇచ్చేత్ సదాశివాత్ l
మోక్షం ఇచ్చేత్ జనార్దనాత్ ll’
అనగా ఆధ్యాత్మిక జ్ఞానము కోసము శివుడిని మరియు మోక్షము కొరకు జనార్దుడిని(విష్ణువు) కొలవాలని అర్థము !
‘జ్ఞానం ఇచ్చేత్ సదాశివాత్ l
మోక్షం ఇచ్చేత్ జనార్దనాత్ ll’
అనగా ఆధ్యాత్మిక జ్ఞానము కోసము శివుడిని మరియు మోక్షము కొరకు జనార్దుడిని(విష్ణువు) కొలవాలని అర్థము !
No comments:
Post a Comment