Friday 19 September 2014

ఉప్పు నీటి థెరపీ


వాతావరణములో ఉండే చెడు శక్తుల ప్రభావము వలన మనిషిలో తామసిక శక్తి (నల్ల శక్తి) వృద్ధి చెంది, అతనిలో నిరాశ, అనావశ్యక ఆలోచనలు,ఒత్తిడి, సరియైన నిర్ణయమును తీసుకోనలేక పోవడము మొదలగు సమస్యలు వస్తాయి. దీని పర్యావసానముగా ఈ చెడు శక్తి వలన వ్యసనములు, ఆర్థిక ఇబ్బందులు, చాతి నొప్పి మొదలుగునవి వస్తాయి.
ఈ ఉప్పు నీరు థెరపీ చేయుట వలన అధ్యాత్మికముగా ఉపాయము అయ్యి మన లోని కనిపించని నల్ల శక్తి బయటకు పోతుంది. ఆధ్యాత్మిక సాధన చేసే వారికి ఆధ్యాత్మిక బలము కూడా పెరుగుతుంది.



చేయు విధానము :-
ఒక్క బకెట్టులో అర మోకాళ్ళ ఎత్తు వరకు నీరు నింపి అందులో రాళ్ల ఉప్పు అంటే కళ్ళు ఉప్పుని గుప్పెడు వెయ్యాలి. తరువాత రెండు కాళ్ళను బకెట్టులో ఉంచి 12 నుండి 14 నిమిషాల వరకు 'శ్రీ కుల దేవతయై నమః' అని నామ జపమును చెయ్యాలి. తరువాత కాళ్ళను తీసి, ఆ బకెట్టులోని నీటిని మరుగుదొడ్డిలో పారవేయ్యాలి.

No comments:

Post a Comment