Sunday, 31 August 2014

శ్రీ గణేశుడు ఏకదంతుడు ఎలా అయ్యారు ?

కార్తవీర్యుడిని వధించిన తరువాత పరుశురాముడు కైలాషమునకు వెళ్లారు. అక్కడ అన్ని గణములతో కలిసి గణాధీషుడు ఉన్నారు. శంకురుడిని దర్శించుకోవాలనే ఇచ్చ పరుశురమునికి కలిగినది. కానీ, ఆ సమయములో శివ-పార్వతులు విశ్రాంతి తీసుకొనడము వలన గణేశుడు ‘కొద్ది సేపు నిరీక్షణ చెయ్యమని’ చెప్పారు.



కానీ పరశురాముడు వినకుండా చేతిలో పరశు ని తీసుకొని నిర్భయముగా వెళ్ళసాగారు. అప్పుడు గణేశుడు ప్రేమతో మరియు వినయముతో ఇంకోసారి ఆపారు. క్రోధముతో అతనిని చంపేందుకు పరశురాముడు పరశుని ఎత్తారు. అయిన సరే, ధర్మాన్ని సాక్షిగా తీసుకొని శ్రీ గణేశుడు అపసాగారు. అయిన పరశురాముడు వినకపోయే సరికి గణేశుడు తన తొండమును పెద్దగ చేసి పరశురాముడిని అందులో ఇరికించి సప్త లోకములలో త్రిప్పసాగాడు. అప్పుడు పరశురాముడు, గురు దత్త ఇచ్చిన స్తోత్ర కవచమును పటించి, పరశుని గణేశుని మీదకు విసురుతాడు.  దానిని వ్యర్థము చేసేందుకు శ్రీ గణేశుడు ఎడమ దంతమును విసురుతాడు. అప్పుడు పరశు అస్త్రము వ్యర్థము అవుతుంది; కానీ గణేశుని దంతము విరిగిపోతుంది.
 

Saturday, 30 August 2014

గణపతి పదమునకు అర్థము ఏమిటి ?

గణ+పతి = గణపతి, సంస్కృత నిఘంటువు అనుసారముగా 'గణ' అంటే పవిత్రకాలు. పవిత్రకాలు అంటే సుక్ష్మతి సుక్ష్మ చైతన్య కణాలు. 'పతి' అంటే పాలించేవాడు(స్వామి). గణపతి అంటే పవిత్రకములకు స్వామి అని అర్థము.





గణపతి దేవునికి వివిధ పేర్లు ఉన్నాయి. అవి -
వక్రతుండ, ఏక దంత, లంబోదర, భాలచంద్ర, వినాయక, మంగళ మూర్తి, విద్యాపతి, మరియు చింతామణి.

వివిధ యుగములలో వీరి అవతారములు -
మహోత్కట వినాయకుడు - సత్య యుగము
గుణేశ - త్రేతా యుగము
గజాననా - ద్వాపర యుగము
దుమ్రకేతు - కలి యుగము  (ఈ అవతారము కలియుగములో కానున్నది. ఈయన ధూమ్ర వర్ణములో ఉంది మ్లేచ్చులను నాశనము చేస్తారని భవిష్య పురాణములో చెప్పడమైనది.

Friday, 29 August 2014

శ్రీ గణపతికి గరికను ఎందుకు సమర్పిస్తారు ?




గరిక అనేది ఒక్క ప్రత్యేకమైన పవిత్ర గడ్డి. గణపతి దేవుని నుండి వెలువడే పవిత్రకములను ఇది ఎక్కువుగా గ్రహించి, ప్రక్షేపిస్తుంది. గరికలో మూల శివ, శక్తి మరియు గణపతి తత్త్వములను ఆకర్షించే శక్తి కూడా ఉంది. అందువలనే గరికను శ్రీ గణపతి పూజకు ఉపయోగిస్తారు. గణపతికి మూడు లేదా అయిదు ఆకులు గల గరికను సమర్పిస్తారు. గణపతికి  కనీసము 21 సంఖ్యలో గరికలను సమర్పించాలి. వీటిని కట్టి, నీళ్ళల్లో ముంచి అర్పించాలి. గణపతి దేవుని శిరస్సుని వదిలి మిగతా శరీర భాగమంతా గరికతో కప్పవలెను. ఇందువలన గరికలోని సుగంధము మూర్తి చుట్టూ వ్యాపిస్తుంది.

Saturday, 26 July 2014

గోమాత ఎలా ఉద్భవించినది?

 ఆవు పుట్టుక గురించి శతపథ బ్రాహ్మణ గ్రంథములో ఈ విధముగా ఉంది. దక్ష ప్రజాపతి ప్రాణిసృష్టి చేసిన పిమ్మట కొంచెము అమృతమును త్రాగారు. త్రాగిన తరువాత వారు ప్రసన్నమయ్యారు. ఆ సమయములో వారి శ్వాస ద్వార సుగంధము వెలువడి అంతటా ప్రసరించినది. ఆ శ్వాస నుండి ఒక్క ఆవు జన్మించినది. సుగంధము ద్వార జన్మించుట వలన దక్ష ప్రజాపతి దానికి ‘సురభి’ అని పేరు పెట్టారు. సురభి నుండి అనేక ఆవులు జన్మించాయి. అందుకనే సురభిని గోవంశమునకు మాతగా, జననీగా పరిగణిస్తారు.


సురభి ఒక్కసారి తపస్సునారంభించనది. బ్రహ్మ దేవుడు ఆ తపస్సునకు మెచ్చి సంతుష్టుడయ్యారు. సురభికి అమరత్వమును ప్రసాదించారు. త్రిలోకముల కన్నా పైన ఉండే స్వర్గమును వరముగా ఇచ్చారు. దీనిని స్వర్గ గోకులమనే పేరుతొ పిలుస్తారు. గోలోకములో సురభి నిత్యమూ నివసిస్తుంది, ఈమె కన్యలు, సుకన్యలు భూలోకములో నివసిస్తారు. ఈ గోలోకమునకు అధిపతి గోవిందుడు అనగా శ్రీ కృష్ణుడు. శ్రీకృష్ణ పరమాత్ముడు ‘గోప్రేమికుడు’ అని అంతటా ప్రాచుర్యమైనదే !

Monday, 26 May 2014

'మానవుడు శాఖహారమును భుజిస్తే' ధర్మమును పాటిస్తున్నట్లుగా ఎలా చెబుతాము ?




'శాఖాహారము మనుష్యుడిని సత్త్వ గుణిగా మారుస్తుంది. మానవ జన్మను సార్థకము చేసే సత్త్వ గుణ ఆహారమును భుజించడము అంటే ధర్మ పాలన చేస్తున్నట్లు. ధర్మ పాలన అంటే యోగ్య ఆహార సంహితను స్వీకరించి, దాని అనుసారముగా ఆచరిస్తూ ధర్మమును, దాని పరిణామముగా భగవంతుడిని ఇష్ట పడటము. శాఖాహారము వలన దేహములోని తమో గుణము లయము అవుతుంది. నరుడిని నారాయణుడిగా మార్చే కార్యమును శాఖాహారము చేయగలదు, కావున ధర్మ పాలన చేసినట్లు అవుతుంది.
- ఒక్క విద్వాంసుడు (సౌ. అంజలి గాడ్గిల్ గారికి లభించిన జ్ఞానము)

Thursday, 22 May 2014

మహాభారతమును ‘ధర్మ యుద్ధము’ అని ఎందుకు అంటారు ?


మహాభారతములోని మొదటి మూడు రోజులలో అనేక కౌరవ బంధువులు మరియు వీరులు పాండవుల చేతిలో మరణించారు. పాండవుల పక్షములో ఏ ప్రముఖ సేనాని మృత్యువు కూడా అప్పటి వరకు అవ్వలేదు. అప్పుడు దుర్యోధనునికి కోపము వచ్చి, భీష్ముడిని అడుగుతాడు. అప్పుడు భీష్ముడు ‘రేపు 5 బాణాలతో అయిదుగురు పాండవులను చంపుతాను’ అని అంటారు. అప్పుడు దుర్యోధనుడు ‘ఏ అయిదు బాణాల చేత చంపదలుచుకోన్నారో, ఆ బాణాలు నాకు ఇవ్వండి. ఉదయమే నేను తెచ్చి ఇస్తానని’ అంటాడు. అప్పుడు భీష్ముడు అయిదు బాణాలను మంత్రించి దుర్యోధనుడికి ఇస్తాడు.
 
ఈ విషయము శ్రీ కృష్ణ భగవానునికి తెలిసిపోతుంది. అప్పుడు అయన ఒక ఉపాయము చెబుతారు. పాండవులు వనవాసములో ఉన్నప్పుడు, దుర్యోధనుడు ఒక్కసారి అరణ్యమునకు వెళ్ళతాడు. ఆ సమయములో అర్జునుడు అతని ప్రాణాలను రక్షిస్తాడు. అప్పుడు దుర్యోధనుడు ఏదైనా వరమును కోరమన్నప్పుడు, ‘అవసరము వచ్చినప్పుడు అడుగుతాను, అప్పుడు తప్పక తీర్చమని’ అర్జునుడు చెబుతాడు.
శ్రీ కృష్ణుడు అర్జునుడి యుద్ధ శిబరమునకు వెళ్లి ఆ అయిదు బాణాలను దుర్యోధనుడిని అడిగి తీసుకు రమ్మంటాడు. అర్జునుడు దుర్యోధనుడి దగ్గరకు వెళ్లి ఆ అయిదు బాణాలను అడుగుతాడు. అప్పుడు దుర్యోధనుడు తాను ఇచ్చిన మాట అనుసారముగా ఆ అయిదు బాణాలను అర్జునుడికి ఇచ్చేస్తాడు; అందుకే ఈ యుద్దమును ‘ధర్మ యుద్ధము’ అని అంటారు.

Tuesday, 6 May 2014

గంగా నది ఆధ్యాత్మిక వైశిష్ట్యము

జ్ఞానం మహేశ్వజరాత్ ఇచ్చేత్ మోక్షం ఇచ్చేత్ జనార్ధనాత్ l , అనగా శివుని వద్ద జ్ఞానము మరియు విష్ణువు వద్ద మోక్షమును కోరవలెను.శంకరుడు జ్ఞానమయుడు అగుట వలన శివుని జట నుంచి ప్రవహించే గంగా నది కూడా సరస్వతి నది మాదిరిగా జ్ఞాన దాయకము అయినది  - ప.పూ. డా. ఆఠవలె

 

గంగా నది దశాహరము. అది శారీరిక, వాచిక, మానసికలను కల దశ పాపములను హరిస్తుంది అనగా నాశనము చేస్తుంది.
శారీరిక పాపములు : - ౧. దొంగతనము, ౨. హింస, ౩. పరస్త్రీ గమనము 
వాచిక పాపములు :- ౧. అబద్ధములు చెప్పుట, ౨. కఠోరముగా మాట్లాడుట, ౩. నిందించుట, ౪. అసంబద్దముగా, ఆకారణముగా మాట్లాడుట 
మానసిక పాపములు :- ౧. ఇతరుల ధనమును దొంగాలిద్దమనే ఆలోచన వచ్చుట, ౨. ఇతరుల గురించి చెడుగా ఆలోచించుట మరియు ౩. దురగ్రహము 
- గురుదేవులు డా. కాటేస్వామిజి