Tuesday, 18 June 2013

కేదార్నాథ్ లో వరదలు-భీభత్సము

కేదార్నాథ్ లో వరదలు-భీభత్సము , చాల మంది మృత్యువాత, లక్ష మందికి పైగా నిరాశ్రయులు !!
अतिवृष्टि: अनावृष्टि: शलभा मूषका: शुका: ।
स्वचक्रं परचक्रं च सप्तैता ईतय: स्मृता: ॥ - कौशिकपद्धति

(రాజు ధర్మాచారి కాకపోతే ప్రజలు ధర్మాన్ని పాటించరు. ప్రజలు ధర్మాచరణ చెయ్యకపోతే) అతివృష్టి, అనావృష్టి, మిడతల ఆక్రమణ, ఎలుకల స్వైర విహారం, చిలుకల ఉపద్రవము, అందరి మధ్య కొట్లాటలు, శత్రువుల ఆక్రమణ మొదలగు ఏడు రకముల ప్రమాదాలు నెలకోంటాయి..
దీని తాత్పర్యము ఏమనగా రాజు, ప్రజలు ఇద్దరు కూడా సాధన చెయ్యాలి. అప్పుడే దేశము, ధర్మమూ సురక్షితముగా ఉండి, ఎటువంటి సంకటాలు రావు..

కావున మీ దినచర్యలో సాధనకు కూడా చోటుని ఇవ్వండి. రోజుకి కనీసము ఒక్క గంట అయిన సమయమును కేటాయించండి. ''శ్రీ కుల దేవతయై నమః'' అని నామ జపమును చెయ్యండి. మీ కుల దేవత వెంకటేశ్వర స్వామి అయితే ''శ్రీ వేంకటేశాయ నమః'' అని చెయ్యండి.

Sunday, 5 May 2013

అక్షయ తృతీయ

‘’మదనరత్న’’ పవిత్ర గ్రంథములో వైశాఖ తృతీయ గురించి చెప్పబడినది.
(శ్రీ కృష్ణుడు చెబుతారు) ఓ యుధిష్టిరా, ఈ రోజు చేసే దానము మరియు హోమము ఎప్పడికి క్షయము కావు.
ఈ కారణము చేతనే ఋషి-మునులు ఈ తిథికి అక్షయ తృతీయ అని పేరు పెట్టారు. ఈ రోజు చేసే దానము వలన పుణ్యాబలము పెరుగుతుంది. దీని ఫలితముగా దానము చేసిన వ్యక్తికీ స్వర్గప్రాప్తి లభించును. అక్షయ తృతీయ నాడు దేవతలు మరియు పితురులకు తృప్తి కొరకు చేసే కర్మ కూడా అక్షయము అనగా అవినాశము అవుతుంది.  
అక్షయ తృతీయ మూడున్నర ముహుర్తలలో ఒకటి. ఈ రోజున త్రేతాయుగము ఆరభము అయ్యిందని కొన్ని చోట్ల చెబుతారు. ఈ రోజున అభ్యంగస్నానము మరియు దాన ధర్మాలు చేస్తారు. ఈ రోజున విష్ణు భగవానునికి పూజను చెయ్యడము, నామజపము చెయ్యడము, హోమాలు మరియు పిత్రుతర్పణమును చేస్తారు. కొందరు సూర్యుడి ఎండ నుండి కాపాడుకొనుటకు గొడుగులను మరియు చెప్పులను కూడా దానము చేస్తారు.
ఈ రోజున ఎవ్వరైతే ‘సత్పాత్ర దానము’(అనగా ధనమును స్వీకరించే వ్యక్తీ, ఆ దానమునకు సత్పత్రుడు అయ్యి ఉండాలి)ను చేస్తారో, వారు పూర్వ జన్మలో చేసిన పాపములు తగ్గి, మోక్ష మార్గ దిశగా ముందుకు వెళ్ళతారు. అందుకనే దానము చేస్తే సత్పాత్రునికే చెయ్యాలి.
ఈ రోజున ఉన్నత లోకముల నుండి సాత్త్విక లహరులు భూమి మీదకు ప్రసరిస్తాయి. అందుకని మరణించిన కొన్ని లింగ దేహములు ఆ సాత్వికతను పొంది ఉన్నత లోకాలను పోవాలని పరితపిస్తుంటాయి. అందువలన ఈ రోజు పితురులకు తిల తర్పణము చేస్తారు. జలము మరియు నువ్వులను కలిపి దేవతలు మరియు పితురులకు సమర్పించడమే తిల తర్పణము. ‘తిలము’ సాత్వికమైనవి మరియు జలము భావమునకు ప్రతీకమైనది.
తిల తర్పణము చేసేటప్పుడు ‘నేను భగవంతునికి సమర్పిస్తున్నాను’  అనే అహం భావమును ప్రదర్శించకుండా ‘భగవంతుడే నా నుండి చేయించుకొంటున్నారు’ అనే భావముతో సమర్పిస్తే ఆ దేవతలు ఎక్కువ ప్రసన్నము అవుతారు.



తిల తర్పణము చేసే పద్దతి
మొదట దేవతలను ఆహ్వానించాలి. ఒక్క సాత్విక ప్లేటుని (రాగి గాని వెండి గాని) తీసుకోవాలి. బ్రహ్మను మరియు విష్ణుమూర్తిని లేదా వారిద్దరు గల దత్త రూపమును ఆ ప్లేటులో ఆహ్వానించాలి. తరువాత, దేవతలు నిజముగానే మన ఎదుట ఉన్నారు అనే భావమును పెట్టుకోవాలి. ‘నువ్వుల’ను చేతిలో తీసుకొని శ్రీ విష్ణు మరియు బ్రహ్మ తత్త్వము ఆ నువ్వులలో ఉంది అనే భావముతో దేవతల చరణాలకు అర్పించాలి. 
మరొక ప్లేటుని తీసుకోవాలి. మన పితురులు ఎదురుగ ఉన్నట్లుగా భావించాలి. నువ్వులలో దేవతల తత్త్వము వస్తుంది అనే భావమును పెట్టుకోవాలి. రెండు నిమిషాల తరువాత దేవుని సాత్వికత అందులో వచ్చింది అని భావిస్తూ పితురుల చరణముల మీద వదులుతున్నాము అనే భావముతో తిల తర్పణము చెయ్యాలి.
అహం భావము లేకుండా. పూర్తీ భావముతో ఎంతగా పైనే చెప్పినది చేస్తాము అంతగా మనలో సాత్వికత లభిస్తుంది మరియు పితృ ఋణమును తీర్చిన వాళ్లము అవుతాము.
అధిక వివరాలకు http://www.hindujagruti.org/hinduism/festivals/akshay-tritiya/ చుడండి..
 



Tuesday, 30 April 2013

పూజ గదిలో దేవి-దేవతలను ఎలా అమర్చవలెను?


ఎవరి ఇంట్లో అయితే పూజ గది లేదో, లేదా దేవత ఫోటోలు లేవో, లేదా విగ్రహాలు లేవో, లేదా ఇలవేల్పు దేవత ఫోటోలు లేవో, వారు వెంటనే పూజ గదిని ఇంటిలో అమర్చవలెను. పూజ గదిలో దేవి-దేవతలను ఈ విధముగా అమర్చవలెను.
గణపతి దేవుని విగ్రహము లేదా చిత్రము మధ్యలో ఉండవలెను. పురుష దేవతలు గణపతికి కుడి వైపున (ఉదా: హనుమంతుడు, శ్రీ కృష్ణుడు) మరియు స్త్రీ దేవతలు(ఉదా : అన్నపూర్ణ దేవి) గణపతికి ఎడమ వైపున వచ్చే విధముగా అమర్చవలెను. కొన్ని ఫోటోలలో ఆడ దేవతలతో పాటుగా మగ దేవతలు కూడా కలిసిన ఫోటోలు (ఉదా : సీతారాముడు, లక్ష్మి నారాయణుడు)వుంటాయి. అలాంటి ఫోటోలను గణపతి దేవునికి కుడి వైపు వచ్చే విధముగా పెట్టవలెను. ఎవ్వరికైనా ఆధ్యాత్మిక గురువు ఉండి, కేవలము ఒక్కరే నివశిస్తుంటే  అతను కేవలము గురువుల ఫోటోను మాత్రమే పెట్టవలెను. ఒక్కవేల కుటుంబ సభ్యులు వుంటే గురువుల ఫోటోను గణపతి దేవునికి కుడి వైపున వచ్చే విధముగా పెట్టవలెను.



 ఎవ్వరైతే పూజను చెయ్యలేకపోతారో, వారు క్రింద చెప్పిన విధముగా చెయ్యాలి :
ప్రతి రోజు దేవి-దేవత చిత్రములను గుడ్డతో తుడవాలి. రెండు ఉదబత్తిలను ఉదయము మరియు సాయంత్రము వెలిగించవలెను.
ముందు రోజు పెట్టిన పువ్వులను తీసివేయ్యాలి. ఉదబత్తిలను వెలిగించిన తరువాత సవ్య దిశలో(గడియారపు ముళ్ళు తిరిగే దిశ) త్రిప్పవలెను. నెయ్యి దీపమును వెలిగించిన తరువాత ఆరతి చేస్తున్నప్పుడు సవ్య దిశలో దీపమును త్రిప్పవలెను.
విగ్రహములను లేదా చిత్ర పటములను మొదట తడి గుడ్డతో తరువాత పొడి గుడ్డతో తుడవవలెను. గంధమును పెట్టవలెను. తరువాత అక్షింతలు, పువ్వులు, పసుపు మరియు కుంకుమను సమర్పించవలెను. దాని తరువాత ఉదబత్తిలను వెలిగించి, దీపముతో హారతిని ఇవ్వవలెను. చివరగా, నైవేద్యమును చూపించవలెను.

Saturday, 27 April 2013

అన్నమును ''పరబ్రహ్మ'' అని ఎందుకు అంటారు?

हे न जाणावे साधारण ।
अन्‍न ब्रह्मरूप जाण ।
जे जीवनहेतु कारण ।
विश्‍वा यया ।। - श्री भावार्थदीपिका (श्री ज्ञानेश्‍वरी ३:३३)

 సంతు జ్ఞానేశ్వర్ గారు చెప్పిన విధముగా ''పూర్తీ విశ్వమంత బ్రహ్మలోనే పుట్టి, పెరిగి, అందులోనే లయము అవుతుంది. అదే విధముగా అన్ని జీవరాశులు అన్నముతోనే పుట్టి, పెరిగి, అందులోనే లయము అవుతాయి. అందుకనే అన్నమును ''పరబ్రహ్మ''తో పోలుస్తారు.

ఎవ్వరికైనా భోజనమును వడ్డించేటప్పుడు ఎలా వడ్డించాలి? క్రింద ఇచ్చిన బొమ్మను చూడండి.



అన్నము, చపాతీ, కూర అనేవి ప్లేటుకి మధ్యలో వడ్డించాలి. ప్లేటుకి కుడి వైపున (అనగ తినే వ్యక్తికీ ఎడమ వైపున)పళ్ళు, డ్రై fruits మొదలుగునవి వడ్డించాలి. ప్లేటుకి ఎడమ వైపున ద్రవ పదార్థాలను(మజ్జిగ, పప్పు మొదలుగునవి) వడ్డించాలి. పచ్చడి, ఉప్పు మొదలైనవి అన్నమునకు ముందు  ఎడమ వైపున వడ్డించాలి.

అన్నమును ఎప్పుడు తినాలి?
పిల్లలు మూత్రము పోసినప్పుడు, మల విసర్జన చేసినప్పుడు వాళ్ళకు ఆకలి వేస్తుంది. అనగా వాళ్ళకి ఆకలి వేస్తుందనే దానికి ఇది సంకేతము. పెద్దలు అయితే భోజనము చేసిన మూడు గంటలు వరకు ఏమి తినరాదు. అర్థ రాత్రి గాని, తెల్లవారే గాని ఏమి తినకూడదు. కాని యువకులు, పెరుగుతున్న పిల్లలు మాత్రమూ ఎప్పుడు అయిన తినవచ్చు. వాళ్ళకి ఆకలి వేస్తె తినవచ్చు.
అన్నమును తినే ముందు కాళ్ళు, చేతులు, నోరు బాగా కడుక్కోవాలి. అన్నమునకు ప్రార్థన చేసిన తరువాతనే భుజించాలి (దీనికి సంబందించిన విషయము త్వరలో ఇవ్వబడును). అన్నమును తింటున్నప్పుడు టీవీ చూడటము, ఎక్కువగా మాట్లాడటము చెయ్యకూడదు. అన్నమును మరీ  స్పీడుగా కాని, మరీ  నెమ్మదిగా కాని తినకూడదు. ఎక్కువగా నవ్వడము కానీ చెయ్యకూడదు.
కొందరు ఈ మధ్యన పిజ్జాలకు, బర్గర్లకు బాగా అలవాటుపడ్డారు. అవి ఏ మాత్రమూ మన ఆరోగ్యానికి మంచివి కావు. శీతల పానీయాలను (అనగా కోక్, sprite) త్రాగకూడదు. కొందరు భోజనమును చేస్తున్నప్పుడు అల్కోహలుని త్రాగుతారు. అలా త్రాగడము ఆరోగ్యానికి చాల హానికరము.
స్థూలకాయ వ్యక్తీ అన్నమును భుజించే ముందు ఎక్కవు నీళ్ళు త్రాగాలి. సన్న వ్యక్తీ భోజనము తరువాత నీళ్ళు ఎక్కవ త్రాగాలి. భోజనము చేస్తున్నప్పుడు ఒక్క కూర నుండి తరువాత కూరకి మారుతున్నప్పుడు ఆ కూర రుచి కోసము కొంచెము నీటిని సిప్ చెయ్యవచ్చును...అధిక వివరములకు http://www.hindujagruti.org/hinduism/knowledge/article/why-is-food-itself-called-as-brahma.html చదవండి.


Friday, 26 April 2013

శ్రీ ఈశ్వర్ సింగ్ ఠాకూర్ గారి ప్రసంగము

హిందూ జన జాగృతి సమితి తరపు నుండి ఆదిలాబాద్లో జరిగిన హిందూ ధర్మ జాగృతి సభలో శ్రీ. ఈశ్వర్ సింగ్ ఠాకూర్ గారు ప్రసంగిచారు..వారు ఏమన్నారో మీరే చుడండి..
http://www.youtube.com/watch?v=-BxHbvWUGms

Wednesday, 24 April 2013

నెయ్యి ప్రాముఖ్యత

హోమము నుండి ఎలాంటి శక్తి లభిస్తుందో, అలాంటి శక్తియే సాత్త్వికమైన ఆహారమును భుజించుట వలన లభిస్తుంది. సాత్త్వికమైన ఆహారమును భుజించుట వలన వెలువడే సాత్త్వికమైన లహరులు, నాభి వద్దన గల అయిదు ప్రాణాధార శక్తులను ఉత్తేజింపచేస్తాయి. ఇవి శరీరము అంతటా ప్రవహిస్తాయి. అందుకనే సాత్త్వికమైన ఆహారమును ''పరబ్రహ్మ'' అని అన్నారు.
అతి సాత్త్వికమైన శాఖాహార పదార్ధములలోఆవు నెయ్యి ఒకటి. ఆవు నెయ్యిలో విష్ణు తత్త్వము అధికముగా ఉంటుంది. గేదె నెయ్యి మనిషిలో స్థూలకాయమును పెంచినట్లుగా ఆవు నెయ్యి పెంచదు. ఆవు నెయ్యిలో దైవీ తత్త్వము, శక్తి మరియు చైతన్యము అధికముగా ఉంటుంది. అందువలన దాని మీద చెడు శక్తులు దాడి చెయ్యలేవు.
క్రింద ఇచ్చిన బొమ్మ, నెయ్యిని సూక్ష్మ పరీక్ష చెయ్యగా గీసినది..

 నెయ్యి సూక్ష్మ చిత్రం


1. దైవీ తత్త్వము ఆకర్షితమగుట
2. చైతన్యము ఆకర్శితమగుట
1a. దైవీ తత్త్వ వలయము నిర్మితము అయ్యి కార్యగతము అగుట
2a. దైవీ చైతన్య వలయము నిర్మితము అయ్యి కార్యగతము అగుట
2b. నెయ్యిలో చిన్న చైతన్య కణములు నిర్మితమగుట
2c. నెయ్యి చుట్టూ చైతన్య కవచ వలయము నిర్మాణము అగుట
3. శ్రీ. ధన్వంతరి దైవీ శక్తి కార్యగతము అగుట
3a. దైవీ శక్తి కణములు నిర్మితము అయ్యి నేయ్యిలోవ్యాపించుట

Monday, 22 April 2013

అరటి పండు వైశిష్ట్యము

అన్ని పండ్లలో కూడా అరటి పండు చాల సాత్వికమైనది..కొందరు సాధకులు, వారు చేసే సాధన వలన సూక్ష్మముగా చాల విషయాలు తెలుసుకొంటారు..వారిలో ఆరవ ఇంద్రియము జాగృతము అయ్యి ఉంటుంది..అయితే వారు అరటి పండుని గమనించినప్పుడు చిత్రములో చూపిన విధముగా కొన్ని మన కంటికి కనపడని తరంగాలు కనిపించాయి..చిత్రమును గమనిస్తూ పై నుంచి క్రిందకు చదివితే...
1. సూక్ష్మముగా సుగంధము వెలువడుట
2. దైవీ శక్తి (ఎరుపు రంగు)
3. సాత్వికత (పసుపు రంగు కణాలు)
4. చైతన్యము