Sunday 21 September 2014

హనుమంతుని శరీరమునకు సింధూరమును ఎందుకు పూస్తారు ?


సీతమ్మ తల్లి తన నుదుటికి సింధురమును పెట్టుకొంటారు. హనుమంతుడు అది చూసి, ‘సీతమ్మ తల్లి, మీరు ప్రతి రోజు ఎందుకు నుదిటికి సింధూరము పెట్టుకొంటారు?’ అని అడుగుతారు. అప్పుడు సీతమ్మ తల్లి ‘శ్రీరాముని ఆయుష్షు పెరుగాలని పెట్టుకొంటాను’ అని చెబుతుంది. అప్పుడు హనుమంతుడు ‘నుదిటి మీద పెట్టుకొంటేనే శ్రీరాముని ఆయుష్షు పెరిగితే, వొళ్ళంతా పెట్టుకొంటే ఇంకా ఎంత ఆయుష్షు పెరుగుతుందో?’ అనే ఆలోచనతో తన వొల్లంత సింధురమును రాసుకొంటారు. అప్పటి నుండి హనుమంతుని శరీరము సింధూరము రంగుగా మారినది.



హిందువుల్లారా, ఈ కథను బట్టి హనుమంతుడు శ్రీరాముని నిజమైన భక్తుడని వెల్లడవుతుంది. ఆయన శ్రీరాముడి గురించి ఏదైనా చెయ్యడానికి తయారుగా ఉండేవారు. అందుకనే హనుమంతుడు శ్రీ రామునికి అత్యంత ప్రియమైనారు. మనము కూడా సదా వారి సేవలో నిమగ్నమయ్యి ఉంటె ఆ భగవంతునికి అత్యంత ప్రియపాత్రులము అవుతాము.

No comments:

Post a Comment