Sunday 31 August 2014

శ్రీ గణేశుడు ఏకదంతుడు ఎలా అయ్యారు ?

కార్తవీర్యుడిని వధించిన తరువాత పరుశురాముడు కైలాషమునకు వెళ్లారు. అక్కడ అన్ని గణములతో కలిసి గణాధీషుడు ఉన్నారు. శంకురుడిని దర్శించుకోవాలనే ఇచ్చ పరుశురమునికి కలిగినది. కానీ, ఆ సమయములో శివ-పార్వతులు విశ్రాంతి తీసుకొనడము వలన గణేశుడు ‘కొద్ది సేపు నిరీక్షణ చెయ్యమని’ చెప్పారు.



కానీ పరశురాముడు వినకుండా చేతిలో పరశు ని తీసుకొని నిర్భయముగా వెళ్ళసాగారు. అప్పుడు గణేశుడు ప్రేమతో మరియు వినయముతో ఇంకోసారి ఆపారు. క్రోధముతో అతనిని చంపేందుకు పరశురాముడు పరశుని ఎత్తారు. అయిన సరే, ధర్మాన్ని సాక్షిగా తీసుకొని శ్రీ గణేశుడు అపసాగారు. అయిన పరశురాముడు వినకపోయే సరికి గణేశుడు తన తొండమును పెద్దగ చేసి పరశురాముడిని అందులో ఇరికించి సప్త లోకములలో త్రిప్పసాగాడు. అప్పుడు పరశురాముడు, గురు దత్త ఇచ్చిన స్తోత్ర కవచమును పటించి, పరశుని గణేశుని మీదకు విసురుతాడు.  దానిని వ్యర్థము చేసేందుకు శ్రీ గణేశుడు ఎడమ దంతమును విసురుతాడు. అప్పుడు పరశు అస్త్రము వ్యర్థము అవుతుంది; కానీ గణేశుని దంతము విరిగిపోతుంది.
 

No comments:

Post a Comment